Ichata Vahanamulu NilupaRadu: నాగార్జున చెప్పిన ఆ మాట వల్లే నాలో మార్పు వచ్చింది!
‘మావయ్య నాగార్జున ఇచ్చిన సలహా వల్ల నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించా’ అని యువ నటుడు సుశాంత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు........
హైదరాబాద్: ‘మావయ్య నాగార్జున ఇచ్చిన సలహా వల్ల నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించా’ అని యువ నటుడు సుశాంత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభంలో అలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకునేవాడ్ని. కథల ఎంపికలో అప్పుడు నాకు అంత స్పష్టత లేదు. కథ నాకు నచ్చినా తెలిసిన వాళ్లకి చెప్పి సలహాలు తీసుకునేవాడ్ని. ‘సొంతగా నిర్ణయం తీసుకో.. సినిమా ఆడినా ఆడకపోయినా..’ అని మావయ్య నాగార్జున ఓసారి నాతో చెప్పారు. అప్పటి నుంచి నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టా. ఆ ఫలితమే ‘చి.ల.సౌ’ చిత్రం. తర్వాత ‘అల వైకుంఠపురములో’, ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. టీమ్ వర్క్తో రూపొందిన చిత్రమిది. అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తెరకెక్కడానికి ముఖ్య కారణం రవిశంకర్, ఏక్తా శాస్త్రి, హరీశ్. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ఇవ్వలేదు’ అని తెలిపారు.
అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత ఇలాంటి వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ప్రపంచంలో థియేటర్లకి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. సుశాంత్ ఈ సినిమా చేస్తున్నట్టు ‘అల వైకుంఠపురములో’ చిత్ర షూటింగ్ సమయంలో చెప్పాడు. సినిమా బాగా వచ్చిందని చాలా మంది అన్నారు. ‘చి.ల.సౌ’ సినిమాలోని సుశాంత్ నటనని మెచ్చి, నా చిత్రంలో అవకాశం ఇచ్చాను. దర్శకుడు దర్శన్కి నా శుభాకాంక్షలు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం నాకు బాగా నచ్చింది. నటీనటులందరికీ నా బెస్ట్ విషెస్. కరోనా పూర్తిగా తగ్గిపోయి మునుపటి పరిస్థితులు రావాలని, అది ఈ సినిమాతోనే మొదలవ్వాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు.
‘వందల సంఖ్యలో ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఓ ప్రేక్షకుడిగా హాజరయ్యాను. వేదికపై నేనుంటే ఎలా ఉంటుందోనని ఊహించుకునేవాడ్ని. ఆ కల ఈరోజు నెరవేరింది. ఈ సందర్భంగా మా అమ్మానాన్నలు, తమ్ముడికి ధన్యవాదాలు చెబుతున్నా. వాళ్ల వల్లే నేనిక్కడ ఉన్నాను. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాశా. ఆ ఘటన 2010లో చెన్నైలో జరిగింది. ‘ఢమరుకం’ చిత్రానికి పనిచేసిన సమయంలో మా టీమ్కి ఈ కథ చెప్తే.. బాగుంది, సినిమా తియ్ అని ప్రోత్సహించారు. 2013లో స్క్రిప్టు పూర్తి చేశా. అప్పటి నుంచి సుమారు 250 సార్లు ఈ కథని పలువురి వద్ద వినిపించాను. చివరగా సుశాంత్తో తెరకెక్కించే అవకాశం దక్కింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, దర్శకుడు విద్యాసాగర్ కారణంగా ఇది సాధ్యమైంది’ అని దర్శన్ తెలిపారు.
‘తెలుగు వారందరికీ నమస్కారం. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నాయికగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక- నిర్మాతలకు ధన్యవాదాలు’ అని మీనాక్షి చౌదరి చెప్పింది. ఈ కార్యక్రమంలో నటులు వెంకట్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, శ్రీనివాస్ అవసరాల, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. -
ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్.. రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసే టైమ్ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ను పంచుకుంది. -
‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?