Pushpa:ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ను ‘పుష్ప’రాజ్ ఫాలో అయ్యాడా?
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాల సందడి నెలకొంది. డిసెంబరు మొదటి వారం నుంచి సంక్రాంతి వరకూ అగ్ర హీరోల సినిమాలతో ఈ జోష్
ఇంటర్నెట్డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాల సందడి నెలకొంది. డిసెంబరు మొదటి వారం నుంచి సంక్రాంతి వరకూ అగ్ర హీరోల సినిమాలతో ఈ జోష్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఆయా సినిమాలు ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే ఓ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’(RRR)ను పుష్పరాజ్ ఫాలో అయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అల్లు అర్జున్(Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). రష్మిక కథానాయిక. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ టీజ్ అంటూ చిత్రం బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. కేవలం 26 సెకన్లు మాత్రమే నిడివి ఉన్న ఈ ట్రైలర్ టీజ్లో ‘పుష్ప’లో ఉన్న పాత్రలన్నింటినీ చూపించారు. అన్ని పాత్రలు తళుక్కుమని మెరిసి వెళ్లిపోతాయి. ఎవరు ఏ పాత్ర పోషించారో తెలియాలంటే మాత్రం ప్లేబ్యాక్ స్పీడ్ను 0.25xకు తగ్గించి చూస్తేనే అన్ని పాత్రలు కనపడతాయి. అలా చూసిన వారందరూ 26 సెకన్లలో ఇన్ని పాత్రలను చూపించారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇలాంటి ట్రెండీ ప్రచారాన్ని ఇంకాస్త ముందుగానే ‘ఆర్ఆర్ఆర్’(RRR) మొదలు పెట్టింది. నవంబరు 1న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ‘గ్లింప్స్’ పేరుతో ఓ వీడియోను పంచుకుంది. 46 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న వీడియోలో ‘ఆర్ఆర్ఆర్’ అద్భుత ప్రపంచాన్ని చూపించారు. అయితే, ఇందులో కూడా ఎవరు? ఏ పాత్రను పోషించారో తెలియాలంటే మాత్రం ఈ వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ను 0.25xకు తగ్గించి చూస్తేనే కనపడతారు. మరి ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’రాజ్ ఫాలో అయినట్టే కనపడుతోంది.
అయితే, ఏ సినిమాకు అదే ప్రత్యేకం. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ భారీ బడ్జెట్తో వస్తున్నవే. ‘పుష్ప’ డిసెంబరు 17న విడుదలవుతుండగా, ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నట్లు డిసెంబరు 6న ‘పుష్ప’ ట్రైలర్, ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల కానున్నాయి. ఈ రెండింటి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..