లియాండర్‌తో ‘ఖడ్గం’ భామ డేటింగ్‌..!

‘మగధీర’లో ‘ఏం పిల్లడూ..’ అంటూ స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కిమ్‌శర్మ గుర్తుందా..!. ‘ఖడ్గం’ సినిమాలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..’ అంటూ తన హావభావాలతో మత్తెక్కించింది. ఈ నలభయేళ్ల దిల్లీ బ్యూటీ ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి గోవా బీచ్‌లో ఏంచక్కా చెట్టాపట్టాలేసుకొని విహరిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.

Published : 15 Jul 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మగధీర’లో ‘ఏం పిల్లడూ..’ అంటూ స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కిమ్‌శర్మ గుర్తుందా..!. ‘ఖడ్గం’ సినిమాలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..’ అంటూ తన హావభావాలతో మత్తెక్కించింది. ఈ నలభయేళ్ల దిల్లీ బ్యూటీ ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి గోవా బీచ్‌లో ఏంచక్కా చెట్టాపట్టాలేసుకొని విహరిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వాళ్లిద్దరూ ఇలా కలిసి కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇద్దరూ కలిసి పలుమార్లు కెమెరాకు చిక్కారు. అయితే.. తాజాగా గోవా పర్యటనకు సంబంధించిన ఫొటోలను వాళ్లు బస చేసిన హోటల్‌ సదరు ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. మరోవైపు కిమ్‌శర్మ తాను సోలోగా ఉన్న ఫొటోలను పోస్టు చేస్తూ ‘మిస్టర్‌.పి’ అంటూ పేస్‌ పేరును చెప్పకనే చెప్పేసింది. 

 2007 సమయంలో కిమ్‌శర్మ భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌తోనూ డేటింగ్‌ చేసింది. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హెజిల్‌ కీచ్‌ను యువీ వివాహం చేసుకున్నాడు. అప్పుడు కిమ్‌శర్మ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా చెప్పింది. 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను కిమ్‌శర్మ వివాహం చేసుకుంది. 2016లో అతని నుంచి విడాకులు తీసుకుంది. కొంతకాలం పాటు నటుడు హర్షవర్దన్‌రానేతోనే ప్రేమాయణం సాగించింది. ఇప్పుడు పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు 48ఏళ్ల లియాండర్‌ పేస్‌ సైతం మోడల్‌ రియా పిళ్లైతో సహజీవనం చేస్తున్నాడు. ఆ ఇద్దరికీ ఒక కూతురు కూడా జన్మించింది. ఈ ఇద్దరి ప్రయాణం ఎన్నాళ్లు సాగుతుందో వేచి చూడాలి మరి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని