Allu Arjun: క్లాసిక్‌ ప్రేమకథలో అల్లుఅర్జున్‌-విశ్వక్‌సేన్‌.. జోరందుకున్న ప్రచారం..!

కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘ఓ మై కాదవులే’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఊరమాస్‌ నటుడు విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ఈ రీమేక్‌ రూపుదిద్దుకుంటోంది....

Published : 05 Aug 2021 11:49 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘ఓ మై కాదవులే’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఊరమాస్‌ నటుడు విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ఈ రీమేక్‌ రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఒరిజినల్‌లో విజయ్‌సేతుపతి పోషించిన పాత్రను రీమేక్‌లో బన్నీ చేయనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే బన్నీని సంప్రదించిందని.. ఆయన కూడా ప్రాజెక్ట్‌ పట్ల సుముఖత వ్యక్తం చేశారని టాలివుడ్‌ వర్గాల్లో వినికిడి. దీంతో విశ్వక్‌సేన్‌ - అల్లు అర్జున్‌ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

రితికాసింగ్‌, అశోక్‌ సెల్వన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఓ మై కాదవులే’. చిన్నప్పటి నుంచి స్నేహితులైన ఓ జంట ప్రేమ వివాహంతో ఒక్కటవుతారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లెక్కుతారు. మరి, ఆ జంట విడిపోయారా? లేదా కలిశారా? వంటి ఆసక్తికర అంశాలతో ‘ఓ మై కాదవులే’ తెరకెక్కింది. ఈ మొత్తం కథను వేరే వాళ్లకు వివరించే పాత్రలో విజయ్‌సేతుపతి కనిపిస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని