Maheshbabu: వచ్చే నెలలోనే...

మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ కలయికలో సినిమాకోసం రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలాఖరు నుంచే ఆ చిత్రం పట్టాలెక్కనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Updated : 08 Oct 2021 07:14 IST

మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ కలయికలో సినిమాకోసం రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలాఖరు నుంచే ఆ చిత్రం పట్టాలెక్కనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లోనే ఆ చిత్రం పూర్తవ్వనున్నట్టు సమాచారం. ఆ వెంటనే కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు మహేష్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.   హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కనుంది ఆ చిత్రం. మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇందులో మహేష్‌ లుక్‌ విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఆయనకి జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని