Samantha: బీటౌన్పై కన్నేసిన సమంత..
నాగచైతన్య నుంచి విడిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సమంత.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సినీ కెరీర్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది....
హైదరాబాద్: నాగచైతన్య నుంచి విడిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సమంత.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సినీ కెరీర్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో మరింత వృద్ధి చెందేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామ్ బీటౌన్పై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మేన్-2’ అనంతరం సామ్కి బీటౌన్ నుంచి ఎన్నో భారీ అవకాశాలు వచ్చినప్పటికీ.. ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని గతంలో వాటంన్నిటినీ వద్దనుకుందని ఆమె స్నేహితురాలు సద్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా సామ్.. బాలీవుడ్లోనూ స్టార్గా ఎదగాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే బీటౌన్లో తెరకెక్కనున్న ఓ ప్రాజెక్ట్కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పేరు పొందిన దర్శకుడు రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్కి ప్రముఖ నిర్మాణ సంస్థ డబ్బులు సమకూరుస్తుందట. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? నటీనటులు ఎవరు? కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..