Jabardasth: వెంకీ కన్నీటికి కారణమేమిటి?

హైపర్‌ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్‌, చలాకీ చంటి టీమ్‌ లీడర్లుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా....

Published : 08 Aug 2021 16:41 IST

హైదరాబాద్‌: హైపర్‌ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్‌, చలాకీ చంటి టీమ్‌ లీడర్లుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. కాగా, వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. హైపర్‌ఆది స్కిట్‌ కోసం అభి, బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్‌ స్టేజ్‌పై మెరిశారు. భాస్కర్‌ని చూపించిన నరేశ్‌.. ‘ఇతనే మా గురువుగారు’ అని చెప్పగానే.. అభి వేసిన ప్రశ్నకు.. ‘ఎందుకులే అన్నా.. నేను గురువుగారు అంటాను. నువ్వు వెంటనే గురువుగారు గురువుగారు అంటూ గుండెలపై తన్నావు అంటావు’ అంటూ ఆది వేసిన పంచులతో అందరూ నవ్వులు పూయించారు. వరుస పంచులు, స్కిట్‌లతో కడుపుబ్బా నవ్వుకున్న న్యాయనిర్ణేతలు.. స్కిట్ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకోవడంతో ఆశ్చర్యపోయారు. ఏమైందని మనో ప్రశ్నించగా.. ‘చేసేది నేను.. చేయించింది నేను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వెంకీ ఎందుకు అంతలా బాధపడ్డారు? అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని