MAA Elections: నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు కుటుంబం పడిపోయింది: జీవిత

‘నరేశ్‌ తవ్విన గుంటలో మోహన్‌ బాబు కుటుంబం పడిపోయింది’ అని జీవిత అన్నారు.

Published : 09 Oct 2021 02:10 IST

హైదరాబాద్‌: ‘నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు కుటుంబం పడిపోయింది’ అని జీవితారాజశేఖర్‌ అన్నారు. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఆమె జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవిత మరోసారి ప్రెస్‌మీట్‌లో పాల్గొని, మాట్లాడారు.

‘‘ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. ధర్మంగా, న్యాయంగా పోరాడండి. ఇది మన కుటుంబం. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాలు ఎందుకు? అవి అనవసరం. మీరు మంచి చేయండి అని చెప్పడానికి లంచం ఎందుకివ్వాలి? ‘మా’ సభ్యులం సుమారు 920 మంది ఉన్నాం. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేసేందుకు భయపడుతున్నారు. రాజీవ్‌ కనకాల, శివ బాలాజీ మంచిగా మాట్లాడాలి. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ అధ్యక్షుడు కాకూడదా? ప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్‌. మోహన్‌బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది. నరేశ్‌ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోతుంది. ‘మా’ విషయంలో నరేశ్‌ స్వార్థంతో పనిచేశారు. ప్రకాశ్‌రాజ్‌ నిజాయతీగా పనిచేస్తారు. నేను సరదాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మంచి పనులు చేసేందుకు ముందుకొచ్చా. జీవిత రాజశేఖర్‌లని పిచ్చోళ్లని చేయొద్దు’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని