John Abraham: అతడికికరోనా అని తెలియక కలిశా.. నాకూ పాజిటివ్..!

సినీ ఇండస్ట్రీని మరోసారి కరోనా కలవరపెడుతోంది. గత కొన్నిరోజులుగా యువ, స్టార్ సెలబ్రిటీలు దాని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం, ఆయన సతీమణి ప్రియకు కరోజా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది...

Updated : 03 Jan 2022 13:21 IST

ముంబయి: సినీ ఇండస్ట్రీని మరోసారి కరోనా కలవరపెడుతోంది. గత కొన్నిరోజులుగా పలువురు తారలు దాని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం, ఆయన సతీమణి ప్రియకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘మూడ్రోజుల క్రితం నేనొక వ్యక్తిని కలిశాను. అతడికి  కరోనా పాజిటివ్ అని ఆ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి నేను, నా భార్య ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాం. స్వల్ప లక్షణాలుండటంతో పరీక్షలు చేయించుకోగా మా ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేమిద్దరం  వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడ్డాం. కాబట్టి కరోనాని సాధారణంగా తీసుకోవద్దు. మాస్కులు ధరించండి. ఆరోగ్యంగా జీవించండి’’ అని జాన్‌ తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో ఇటీవల కరీనా కపూర్‌, వడివేలు, విశ్వక్‌సేన్‌, మనోజ్‌, శిల్పాశిరోద్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌, నోరా ఫతేహి, రియా కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అన్షుల్లా కపూర్‌ తదితరులు కరోనా బారిన పడగా.. వీరిలో పలువురు కోలుకున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని