Seetimaarr: గోపీచంద్, తమన్నా మాస్ బీట్.. ‘జ్వాలారెడ్డి’ ఫుల్ వీడియో వచ్చేసింది!
సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించిన గీతాల్లో ‘జ్వాలారెడ్డి’ ఒకటి. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన రోజు నుంచే యూట్యూబ్లో విశేష స్పందన లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించిన గీతాల్లో ‘జ్వాలారెడ్డి’ ఒకటి. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన రోజు నుంచే యూట్యూబ్లో విశేష స్పందన లభించింది. మాస్ బీట్ కావడం, గోపీచంద్, తమన్నా కెమిస్ట్రీ అద్భుతంగా పండటమే ఇందుకు కారణం. ఫుల్ వీడియో ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకి చిత్ర బృందం తాజాగా ఆ సర్ప్రైజ్ అందించింది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు.
కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదలై మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్స్టార్’ వేదికగా అలరిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ (కార్తీక్), తమన్నా (జ్వాలారెడ్డి) కబడ్డీ కోచ్లుగా నటించారు. భూమిక, దిగంగన సూర్యవంశీ, పోసాని తదితరులు కీలక పాత్రలు షోషించారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..