Kanabadutaledu Review: కనబడుటలేదు మూవీ రివ్యూ
Kanabadutaledu Review: సునీల్ కీలక పాత్రలో నటించిన ‘కనబడుటలేదు’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: కనబడుట లేదు; నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్, హిమజ, యుగ్రామ్, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, ‘కంచరపాలెం’ రాజు, ఉమామహేశ్వర రావు, కిషోర్, శ్యామ్ తదితరులు; సంగీతం: మధు పొన్నాస్; ఎడిటింగ్: రవితేజ కూర్మాన; సినిమాటోగ్రఫీ: సందీప్ బద్దుల; బ్యానర్స్: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్; సమర్పణ: సరయు తలశిల; రచన, దర్శకత్వం: బాలరాజు; విడుదల: 19-08-2021
రెండో దశ కరోనా తర్వాత చిత్రసీమ మళ్లీ గాడిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు.. సరైన సినిమాలు విడుదలైతే థియేటర్ల దగ్గర మునుపటిలా సందడి ఖాయం అనే భరోసానిస్తున్నాయి. ఈ వారాంతంలో విడుదలైన పలు సినిమాల్లో ‘కనబడుటలేదు’ ఒకటి. సునీల్ కీలక పాత్రలో నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది? సునీల్ ఏ మేరకు ఆకట్టుకున్నారు?
కథేంటేంటే: సూర్య (సుక్రాంత్), శశిద (వైశాలిరాజ్) ప్రేమించుకుని విడిపోతారు. ఆ తర్వాత అయిష్టంగానే ఆదిత్య (యుగ్రామ్)తో శశిద పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా శశిద మనసులో తన ప్రియుడు సూర్య మోసం చేశాడనే బాధ ఉంటుంది. సూర్య చేతిలో అవమానానికి గురైన ఆమె ఎలాగైనా అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం తన భర్త ఆదిత్య సాయం కూడా తీసుకుంటుంది. అలా ఇద్దరూ కలిసి సూర్య కోసమే విశాఖపట్నం వెళతారు. తీరా అక్కడికి వెళ్లాక ఊహించని మలుపు. వీళ్లు వెదుతుకున్న సూర్య కనిపించకుండా వెళ్లిపోతాడు. ఇంతకీ సూర్య ఎక్కడికి వెళ్లాడు? అతన్ని వెతకడం కోసం రంగంలోకి దిగిన డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) ఈ కేసుని ఎలా ఛేదించాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఇదొక మర్డర్ మిస్టరీ. నిజానికి హత్యని ఎవరు చేశారనే కోణంలో నడిపితే ఇదొక ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. కానీ, దర్శకుడు దీనికి డిటెక్టివ్ కామెడీని కూడా జోడించాడు. దాంతో ఏ ఒక్క నేపథ్యానికీ న్యాయం జరగక, కథ... కథనాల్లో ఆసక్తి నీరుగారిపోయింది. కథలో కొత్తదనం ఉంది. కానీ, దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో మాత్రం చాలా తప్పులు చోటు చేసుకున్నాయి. భావోద్వేగాలు కూడా బలంగా పండలేదు. ఒక అమ్మాయి తాను ప్రేమించిన వ్యక్తిని చంపాలనుకుందంటే, ఆమె పడిన బాధ, ఆ అవమానం బలంగా కనిపించాలి. అప్పుడే ప్రేక్షకుడూ ఎంతో కొంత ఆ బాధని అనుభవిస్తాడు, ఆ పాత్రపై జాలి కలుగుతుంది. అలాంటప్పుడే కథలో భావోద్వేగాలు పండుతాయి. కానీ, ఆ విషయంలో దర్శకుడు చేసిన కసరత్తులు సరిపోలేదు. కొన్ని పాత్రల్ని దర్శకుడు బాగానే అల్లాడు. వైశాలి, సునీల్, హిమజ పాత్రలు విడివిడిగా ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ, అవి కథకి సరైన రీతిలో అతకలేదు. కథ ఆరంభం, మలుపులు, సునీల్ పాత్ర చేసే పరిశోధన వరకు పర్వాలేదనిపించినా క్రమంగా సినిమా పట్టు తప్పిపోతుంది.
ఎవరెలా చేశారంటే: సునీల్ చక్కటి అభినయం ప్రదర్శించారు. ఆయన పాత్ర తెరపై బలంగానే కనిపిస్తుంది. వైశాలిరాజ్, సుక్రాంత్, హిమజ తదితరుల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సీఐ విక్టర్రాజుగా కనిపించిన కిషోర్ కుమార్ పాత్ర చేసే హంగామా అతిగా అనిపిస్తుంది. ఆ పాత్రకు డబ్బింగ్ కూడా అతకలేదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. మధు పొన్నాస్ సంగీతం, సందీప్ కెమెరా పనితనం సినిమాకి ప్రధాన బలం. దర్శకుడు బాలరాజు కథ, కథనాల్ని నడిపించిన విధానంలో తడబడ్డారు. కొన్ని పాత్రల్ని మర్డర్ మిస్టరీకి సంబంధించిన అంశాల్ని బాగా రాసుకున్నారు. కొన్ని సంభాషణలు కూడా మెప్పిస్తాయి.
బలాలు
+ ఆరంభ సన్నివేశాలు
+ సునీల్, వైశాలిరాజ్ నటన
+ మలుపులు
బలహీనతలు
- కథ, కథనం
- భావోద్వేగాలు పండకపోవడం
చివరిగా: కనబడుటలేదు... కనిపించేవి కొన్ని పాత్రలే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగ అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు