Puneet Rajkumar: పునీత్‌రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అవార్డు

ప్రముఖ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవల్ని గుర్తించిన  కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు ‘కర్ణాటక రత్న’ను ప్రకటించింది.

Published : 16 Nov 2021 18:57 IST

బెంగళూరు: ప్రముఖ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవల్ని గుర్తించిన కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు ‘కర్ణాటక రత్న’ను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ట్వీట్‌ చేశారు. పునీత్‌ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ అవార్డు ప్రకటనపై పునీత్‌ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్డియక్‌ అరెస్ట్‌తో అక్టోబరు 29 పునీత్‌ మరణించారు. నటుడిగా అలరిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. వందలాది మందికి విద్యాదానం చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్బాంధవుడయ్యారు. అనాథశ్రమాలు, గోశాలలు నిర్వహించారు. సమాజం కోసం పునీత్‌ చేసిన కృషిని గుర్తించి ‘కర్ణాటక రత్న’, ‘బసవ పురస్కార’ అవార్డులు ఇవ్వాలని కోరుతూ సీఎంకు పునీత్‌ అభిమానులు ఇటీవల లేఖలు రాశారు. పలువురు మంత్రులు సైతం ఇదే విషయాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ‘కర్ణాటక రత్న’ అవార్డుతో పునీత్‌ను గౌరవించాలని మంగళవారం నిర్ణయించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని