Kiara Advani: భారీ డిమాండ్‌.. పారితోషికం పెంచేసిన కియారా

కెరీర్‌ ఆరంభించిన కొంతకాలంలోనే బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దూసుకెళ్తున్నారు నటి కియారా అడ్వాణీ.....

Updated : 08 Aug 2021 13:03 IST

ముంబయి: బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దూసుకెళ్తున్న నటి కియారా అడ్వాణీ. మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమై.. తెలుగులోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కియారా కథానాయికగా ఎంపికయ్యారు. ఈ సినిమాలో నటించడానికి ఆమె పారితోషికం భారీగానే తీసుకుంటున్నారట. సాధారణంగా తీసుకునే రూ.4 కోట్ల రెమ్యూనరేషన్‌ కంటే కూడా రూ.కోటి ఎక్కువగా డిమాండ్‌ చేశారట ఈ బీటౌన్‌ భామ. మొత్తంగా రూ.5 కోట్లు కోరగా.. రూ.నాలుగు కోట్ల యాభై లక్షలకి చిత్రబృందం ఒప్పించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్క సినిమాకి కియారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా శంకర్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చెర్రీ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. ఇందులో మరో స్టార్‌ హీరో కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్‌లో ఈ షూట్‌ జరగుతోంది. అలాగే, ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆచార్య’ షూట్‌ చివరిదశకు చేరుకుంది. ఇందులో చెర్రీ సిద్ధ పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని