Kinnerasani: ఉత్కంఠగా ‘కిన్నెరసాని’ టీజర్‌

‘కిన్నెరసాని’ టీజర్‌ని విడుదల చేసిన నటుడు నితిన్‌. కల్యాణ్ దేవ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

Published : 28 Aug 2021 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కల్యాణ్ దేవ్‌ కథానాయకుడిగా రమణ్‌ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిన్నెరసాని’. శీతల్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ నటుడు నితిన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఓ బీచ్‌ సన్నివేశంతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి’, ‘ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ లిమిట్‌ ఉండాలి. అది ద్వేషానికైనా.. చివరకి ప్రేమకైనా’ అనే సంభాషణలు ప్రధానంగా నిలిచాయి. నటీనటుల హావభావాలు, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నల్లుడైన కల్యాణ్‌దేవ్‌.. ‘విజేత’ చిత్రంతో నటుడిగా మారిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని