KondaPolam: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జోడీ అదుర్స్‌.. ‘కొండపొలం’ ట్రైలర్‌ చూశారా..!

‘కొండపొలం’ ట్రైలర్‌ విడుదలైంది. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

Updated : 27 Sep 2021 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ జోడీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

గొర్రెల కాపరిగా, ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తిగా.. రెండు వైవిధ్య గెటప్పుల్లో వైష్ణవ్‌ ఒదిగిపోయాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా వైష్టవ్‌ ఓ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ‘గొర్రెల కాపరుల కుటుంబం, తల్లిదండ్రులకి చదువు లేదు. ఏ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నారు?’ అంటూ ఇంటర్వ్యూ చేసే వారు అడగ్గా ‘అడవి సర్‌. నల్లమల అడవి’ అని  వైష్ణవ్‌ సమాధానం ఇస్తాడు. కట్‌ చేస్తే అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు అలరిస్తూనే ఉత్కంఠగా సాగాయి. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని