Lakshya: ‘లక్ష్య’కి భావోద్వేగాలే బలం
వెండితెరపై ఇప్పటిదాకా చూడని ఓ కొత్త ఆట నేపథ్యంతోపాటు, అన్ని రకాల భావోద్వేగాలున్న సినిమానే మా ‘లక్ష్య’ అన్నారు నిర్మాతలు నారాయణ్దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్రావు. ఆ ఇద్దరూ శరత్ మరార్తో కలిసి నిర్మించిన చిత్రం ‘లక్ష్య’.
వెండితెరపై ఇప్పటిదాకా చూడని ఓ కొత్త ఆట నేపథ్యంతోపాటు, అన్ని రకాల భావోద్వేగాలున్న సినిమానే మా ‘లక్ష్య’ అన్నారు నిర్మాతలు నారాయణ్దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్రావు. ఆ ఇద్దరూ శరత్ మరార్తో కలిసి నిర్మించిన చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
* ‘‘సినిమాకి ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ మంచిదే. టికెట్ ధరలే ఇబ్బందికరంగా ఉన్నాయి. తెలంగాణలో బాగున్నా, ఆంధ్రప్రదేశ్లోనే సమస్య. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని నమ్ముతున్నాం. మన దగ్గరున్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో నిర్మించాం. ప్రేక్షకులు అలాంటి థియేటర్లలోనే సినిమా చూడాలనుకుంటారు. కచ్చితంగా టికెట్ ధరలు పెంచాల్సిందే. ఆ ధరలు మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదనేదే మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు మరీ తక్కువగా నిర్ణయించారు. అది నిర్మాతలకి కష్టంగా మారింది. ప్రస్తుతం మా సంస్థలో నాగార్జున చిత్రంతోపాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా ఓ సినిమా నిర్మిస్తున్నాం. శివకార్తికేయన్తో ఓ సినిమా, సుధీర్బాబుతో ఓ ప్రాజెక్టు చేస్తున్నాం. సందీప్కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్ల కలయికలో మరోటి చేస్తున్నాం’’.
* ‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘లవ్స్టోరి’ మంచి విజయాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలోనే ఈ వారం ‘లక్ష్య’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. విలువిద్య నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఆ అంశమే అందరినీ ఆకట్టుకుంటుంది. మొదట ఈ కథ విన్నప్పుడు భయపడ్డా. పూర్తి కథ విన్నాక చేయాలని నిర్ణయించాం. ఆటతోపాటు, బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రమిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లలోనూ, ఓవర్సీస్లో వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహాలు ఉండేవి. ‘అఖండ’తో ఆ భయాలన్నీ తొలగిపోయాయి. రెండేళ్ల కిందటే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్మేశాం. ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకులు చూడాలనేది మా కోరిక. సినిమాలు చిన్నవా పెద్దవా అనేది కాదు. కథ బాగుంటే అన్నీ చూస్తారు ప్రేక్షకులు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?