Alitho Saradaga: నేను నటించిన సినిమా చూసి రెండు నెలలు నిద్రపోలేదు: పూర్ణ

‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. ‘అవును’, ‘సీమ టపాకాయ్‌’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న మలయాళీ నటి పూర్ణ. ఇటీవల ఆమె బాలకృష్ణ నటించిన ‘అఖండ’లో పద్మావతి పాత్రలో కనిపించి మంచి మార్కులు...

Updated : 08 Dec 2021 13:55 IST

హైదరాబాద్‌: ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. ‘అవును’, ‘సీమ టపాకాయ్‌’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న మలయాళీ నటి పూర్ణ. ఇటీవల ఆమె బాలకృష్ణ నటించిన ‘అఖండ’లో పద్మావతి పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో వరదరాజులుగా శ్రీకాంత్‌ తన నటనతో అందర్నీ భయపెట్టేశారు. తాజాగా ఈ ఇద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘అవును’ సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్‌ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని’’ అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్‌’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్‌’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. ఇక, శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సమయంలో డ్యాన్స్‌ మూమెంట్స్‌ విషయంలో డైరెక్టర్‌ తనని ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని