Bigg Boss Telugu 5: నా పెర్ఫామెన్స్ నచ్చిందా? గంటెందుకు కొట్టడం లేదు: సన్నీ
‘‘నువ్వు ఏం నిరూపించడానికి గేమ్ ఆడతావో నాకు అర్థమే కాదు. నీకన్నా అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఒక్కడ్ని విలన్ చేయడానికి ఫస్ట్ కూర్చుంటావ్’’ ...
హైదరాబాద్: ‘‘నువ్వు ఏం నిరూపించడానికి గేమ్ ఆడతావో నాకు అర్థమే కాదు. నీకన్నా అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఒక్కడ్ని విలన్ చేయడానికి ఫస్ట్ కూర్చుంటావ్’’ అంటూ సిరిపై తనకున్న అసహనాన్ని సన్నీ వ్యక్తం చేశాడు. గత కొన్నిరోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-5’ తుది దశకు చేరుకుంటోంది. దీంతో ప్రస్తుతం హౌస్లో ఉన్న టాప్-7 కంటెస్టెంట్స్ మధ్య పోరు మరింత హోరాహోరీగా మారింది. ‘టికెట్ టు ఫినాలే’ కోసం ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఓ పోటీ పెట్టారు. హౌస్మేట్స్ ఐస్ టబ్లో కాళ్లు పెట్టుకొని ఉండాలని, కాళ్లు బయట పెట్టినప్పుడు ఇతర ఇంటిసభ్యులు అతని సమీపంలోని బాల్స్లో ఒకదాన్ని తీసుకుని వారి టబ్లో వేసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్ తొలుత సరదా సాగింది. ఇక రెండో లెవల్లో సన్నీ, షణ్మఖ్లు తమ స్థానాలను మార్చుకున్నారు. దీంతో, సిరి పక్కనే సన్నీ రావడంతో.. అతని వద్ద నుంచి ఓ బాల్ని ఆమె దొంగిలించింది. ఈ క్రమంలో సిరి-సన్నీ మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ‘హలో హలో.. నా కాలు ఇంకా టబ్లోనే ఉంది. మీరేలా నా బాల్ తీసుకుంటారు’ అని సన్నీ అడగ్గా.. ‘‘లేదు సన్నీ.. నీ కాలు టబ్లో లేనప్పుడే నేను బాల్ తీసుకున్నాను’’ అని సిరి సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహానికిలోనైన సన్నీ.. ‘ఆడండి.. మీరే ఆడండి. నేను కూడా నా ఆట చూపిస్తా’’ అంటూ కేకలు వేశాడు. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో? ఫినాలేకి టికెట్ ఎవరు పొందుతారో? తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..