Bigg Boss Telugu 5: ఈసారి నో సీక్రెట్ రూమ్.. లోబో ఎలిమినేట్!
బిగ్బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్లో సిరి, శ్రీరామ్, రవి, లోబో,
హైదరాబాద్: బిగ్బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్లో సిరి, శ్రీరామ్, రవి, లోబో, మానస్, షణ్ముఖ్ ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన లోబో ఎలిమినేట్ అయినట్లు షో వ్యాఖ్యత నాగార్జున ప్రకటించారు. ఇక ఈసారి ఎలాంటి సీక్రెట్ రూమ్లు లేకుండా లోబో బయటకు వెళ్లిపోయాడు.
మొదట్లో లోబో తనదైన కామెడీతో నవ్వులు పంచాడు. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అలరించాడు. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయేవాడు. అయితే, హౌస్లోకి రాకముందే రవితో ఉన్న స్నేహం కారణంగా అతడితో ఎక్కువ సమయం ఉండేవాడు. ఒకానొక దశలో రవి ఏది చెబితే అది నమ్మేసేవాడు. టాస్క్ల సందర్భంగా తనవంతు కృషి చేసేవాడు. ‘వెయిట్లాస్’ టాస్క్ సందర్భంగా నట్రాజ్ కోసం ఏమీ తినకుండా లోబో నిగ్రహంగా ఉండటం హౌస్మేట్స్ను ఆశ్చర్యపరిచింది. ఇక నామినేషన్స్ సందర్భంగా కొన్నిసార్లు విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు.
ముఖ్యంగా ప్రియపై లోబో గట్టి గట్టిగా అరవడంతో నాగార్జున సైతం క్లాస్ తీసుకున్నారు. అక్కడి నుంచి అతడి ఆట తీరులో మార్పు వచ్చింది. టాస్క్ల్లో పెద్దగా ప్రయత్నం చేసేవాడు కాదు. ఉత్సాహంగా పాల్గొనేవాడు కాదు. దీంతో ప్రియ కన్నా ముందు లోబో ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి అతడిని సీక్రెట్ రూమ్లో ఉంచాడు బిగ్బాస్. హోస్ట్ నామినేట్ చేయడంతో నేరుగా నామినేషన్స్లో ఉన్న లోబో గతవారం ప్రియ తప్పులు చేయడంతో ఆమెకు తక్కువ ఓట్లు పడి ఎలిమినేట్ అయింది. దీంతో లోబో సేఫ్ అయ్యాడు. ఈ వారం ప్రియాంక కోసం లెటర్ వదులుకుని నామినేషన్స్లో నిలిచి, చివరకు ఎలిమినేట్ అయ్యాడు.
దీపావళి సందర్భంగా స్పెషల్ గెస్ట్లు వీళ్లే!
బిగ్బాస్ హౌస్లో దీపావళి కాస్త ముందుగానే వచ్చింది. ప్రత్యేక కార్యక్రమాలతో, స్పెషల్ గెస్ట్లతో హౌస్ సందడి సందడిగా మారింది. నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యుల నుంచి లేఖలు అందుకోలేకపోయిన హౌస్మేట్స్కు నాగార్జున లేఖలు ఇచ్చారు. వాటిని చదివి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. యాంకర్ సుమ ఇంటి సభ్యులను అనుకరిస్తూ అలరించారు. హౌస్లో ఎవరెవరు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారన్నది చేసి చూపించారు. అనంతరం విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ విచ్చేసి ఇంటి సభ్యులతో మాట్లాడారు. వాళ్ల కోసం స్వీట్స్ ఇచ్చారు. దివి, అవికా గోర్, మోనాల్ గజ్జర్ల డ్యాన్స్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇక అవినాష్, బాబా భాస్కర్ తమదైన పంచ్డైలాగ్లతో నవ్వులు పంచారు. గాయని, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కల్పన పాడిన పేరడీ పాటలు కితకితలు పెట్టాయి. ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్ర బృందం సంతోష్ శోభన్, మెహ్రీన్, దర్శకుడు మారుతీ షోకు విచ్చేసి హౌస్మేట్స్తో సరదాగా ముచ్చటించారు. దీపావళి స్పెషల్ అట్రాక్షన్గా శ్రియ నిలిచారు. ఇంటి సభ్యులతో మాట్లాడుతూ తెగ ఆనంద పడిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.