Cinema News: హిందీ చిత్రసీమకు తీపి కబురు
కరోనా తగ్గుముఖం పట్టినా హిందీ చిత్రసీమలో సందడి లేదు. ఎందుకంటే బాలీవుడ్కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. అయినా సరే ధైర్యం చేసి ముందుకొచ్చిన ‘బెల్బాటమ్...
కరోనా తగ్గుముఖం పట్టినా హిందీ చిత్రసీమలో సందడి లేదు. ఎందుకంటే బాలీవుడ్కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. అయినా సరే ధైర్యం చేసి ముందుకొచ్చిన ‘బెల్బాటమ్’ లాంటి చిత్రాలకు ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో థియేటర్లను వందశాతం తెరవాలని చిత్రసీమ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందరో ప్రముఖులు విన్నవించుకున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న చిత్రసీమకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల 22 తర్వాత సినిమా హాళ్లు తెరచుకోనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆరోగ్య నియమాలు, కరోనా నిబంధనలు పాటిస్తూ అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరుస్తాం. పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్లు తెరచినా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారా? లేదంటే 50శాతంతోనే థియేటర్లు తెరవాలంటారో అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే ఓ భారీ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది.
దీపావళికి సూర్యవంశీ
అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సూర్యవంశీ’. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు దర్శకుడు రోహిత్ శెట్టి ఇన్స్టా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు రోహిత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘‘అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరుస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ధన్యవాదాలు. మేం దీపావళికి వస్తున్నాం’’అని పోస్ట్ చేశారు. 2020 మార్చి 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధకావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్గణ్ అతిథి పాత్రల్లో నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు