Cinema News: హిందీ చిత్రసీమకు తీపి కబురు
కరోనా తగ్గుముఖం పట్టినా హిందీ చిత్రసీమలో సందడి లేదు. ఎందుకంటే బాలీవుడ్కు కీలకమైన మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. అయినా సరే ధైర్యం చేసి ముందుకొచ్చిన ‘బెల్బాటమ్’ లాంటి చిత్రాలకు ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో థియేటర్లను వందశాతం తెరవాలని చిత్రసీమ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందరో ప్రముఖులు విన్నవించుకున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న చిత్రసీమకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల 22 తర్వాత సినిమా హాళ్లు తెరచుకోనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆరోగ్య నియమాలు, కరోనా నిబంధనలు పాటిస్తూ అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరుస్తాం. పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్లు తెరచినా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారా? లేదంటే 50శాతంతోనే థియేటర్లు తెరవాలంటారో అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే ఓ భారీ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది.
దీపావళికి సూర్యవంశీ
అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సూర్యవంశీ’. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు దర్శకుడు రోహిత్ శెట్టి ఇన్స్టా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు రోహిత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘‘అక్టోబరు 22 తర్వాత థియేటర్లు తెరుస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ధన్యవాదాలు. మేం దీపావళికి వస్తున్నాం’’అని పోస్ట్ చేశారు. 2020 మార్చి 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధకావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్గణ్ అతిథి పాత్రల్లో నటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
-
General News
Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు
-
Politics News
CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- INDIA vs WI: వెస్టిండీస్పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్బై.. 2016 తర్వాత తొలిసారి!
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
- INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా
- IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
- Delhi: పోలీసుస్టేషన్లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్పై రౌడీ మూక దాడి