Maheshbabu: మహేశ్‌-ఎన్టీఆర్.. ఇక పూనకాలకు వేళాయె

ఒకరు ఛార్మింగ్‌లో సూపర్‌స్టార్‌.. మరొకరు నటనలో యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోల సరదా మాటలకు వేదికైంది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Kotiswarulu)...

Updated : 20 Nov 2021 12:08 IST

పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌

 

హైదరాబాద్‌: ఒకరు సూపర్‌స్టార్‌.. మరొకరు యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోల సరదా మాటలకు వేదికైంది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Kotiswarulu). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షోలో తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (MaheshBabu) సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు ఫుల్‌ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ పోస్టర్‌ని నెట్టింట్లో షేర్‌ చేసింది. ‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు.. ‘‘మేము కూడా ఇక్కడ వెయిటింగ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షోలో ఇప్పటివరకూ పలువురు స్టార్‌ సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్స్‌లో రామ్‌చరణ్‌ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, సమంతలు సైతం ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్‌ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని