Mahesh Babu: బాలకృష్ణను మెచ్చిన మహేశ్‌బాబు.. ఒకే వేదికపై సందడి

ప్రముఖ నటులు బాలకృష్ణ, మహేశ్‌బాబు ఒకే వేదికపై సందడి చేశారు. త్వరలోనే ఆ హంగామాను ప్రేక్షకులకి చూపించనున్నారు.

Published : 05 Dec 2021 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటులు బాలకృష్ణ, మహేశ్‌బాబు ఒకే వేదికపై సందడి చేశారు. త్వరలోనే ఆ హంగామాను ప్రేక్షకులకి చూపించనున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ఈ షోకి మహేశ్‌బాబు అతిథిగా విచ్చేశారు. సంబంధిత ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తయ్యాక మహేశ్‌ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘అన్‌స్టాపబుల్‌ బాలకృష్ణగారితో సమయం చాలా సరదాగా గడిచింది’ అని పేర్కొన్నారు. బాలకృష్ణతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఈ కార్యక్రమానికి తొలి అతిథిగా పాల్గొని మోహన్‌బాబు, రెండో అతిథిగా నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, దర్శకుడు అనిల్‌ రావిపూడి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంచి వినోదం పంచారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని