MaheshBabu NTR: ఒకే స్టేజ్‌పై మహేశ్‌-ఎన్టీఆర్‌.. రికార్డుల మోత మోగాల్సిందే..!

అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేస్తోంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది...

Updated : 19 Sep 2021 10:59 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ‘ఆట నాది.. కోటి మీది’ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు వ్యాఖ్యాతగా మరింత చేరువయ్యారు తారక్‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.

బుల్లితెర వేదికగా ప్రముఖ ఛానల్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ షో సామాన్యులకు ఎంతో చేరువైంది. ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా.. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ సైతం తమ ఆటతో మెప్పించనున్నారు. కాగా..దసరా కానుకగా ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. ఈ వార్తలపై ఇప్పటికే నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వీరిద్దరి కాంబినేషన్‌లో షో వస్తే.. ఇక టీఆర్పీల పరంగా రికార్డుల మోత మోగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని