MaheshBabu: మన పిల్లలకు రక్షణ ఉంటుందా?: మహేశ్‌బాబు

సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం గురించి కథానాయకుడు మహేశ్‌బాబు స్పందించారు. సమాజం నానాటికి దిగజారిపోతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో...

Published : 15 Sep 2021 11:54 IST

ఆవేదన వ్యక్తం చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనపై కథానాయకుడు మహేశ్‌బాబు స్పందించారు. సమాజం నానాటికి దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో పిల్లలకు రక్షణ ఉంటుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్‌ చేశారు.

‘‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అకృత్యంతో సమాజం ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. మన ఇంటి ఆడపిల్లలు సురక్షితంగా ఉన్నారా? నిరంతరం ఈ ప్రశ్న ప్రతిఒక్కర్నీ కలచివేస్తోంది. ఎంతో ఆవేదనకు గురి చేస్తోంది. బాధిత కుటుంబం పడుతోన్న బాధను ఊహించలేకపోతున్నాను. ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరుకుంటున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. మరోవైపు నటుడు మంచు మనోజ్‌ మంగళవారం సింగరేణి కాలనీకి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని