Tirupati Floods: భయంగా ఉందంటోన్న మంచు లక్ష్మి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితులు...

Published : 26 Nov 2021 20:45 IST

తిరుపతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితులు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరద ముప్పు నుంచి ఇంకా తేరుకోకముందే అల్పపీడనం రూపంలో ఇప్పుడు మరో గండం రాయలసీమ ప్రజలను వెంటాడుతోంది. మరో మూడు రోజులపాటు అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో తాజాగా నటి మంచు లక్ష్మి.. ఏరియల్‌ వ్యూ ద్వారా తిరుపతిలో ఉన్న పరిస్థితులను తెలియజేశారు. ‘‘తిరుపతిలో ఎక్కడ చూసినా భారీగా వరద నీరు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులను ఇప్పటివరకూ నేను చూడలేదు. ఇది నన్ను భయానికి గురి చేస్తోంది. మరో మూడు రోజులపాటు తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని, కుటుంసభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని మంచు లక్ష్మి ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు