Manchu Manoj: ఇలాంటి అవాస్తవాలు రాయకండి అన్నా

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగిపోయిందని..

Updated : 22 Aug 2021 14:00 IST

కెరీర్‌ రూమర్స్‌పై స్పందించిన మనోజ్‌

హైదరాబాద్‌: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగిపోయిందని.. మనోజ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కాలంలో మనోజ్‌ వ్యాపారరంగంపై దృష్టి సారించారని.. దీంతో యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నారని పలువురు అంటున్నారు. కాగా, తాజాగా తన కెరీర్‌ గురించి వస్తోన్న వార్తల గురించి మనోజ్‌ స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని అన్నారు. తనకి సినిమానే జీవితమని.. ఇప్పటికీ, ఎప్పటికీ సినీ పరిశ్రమలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయకండి అన్నో.. వేసవి నుంచి మన సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. యాక్షన్‌ అని చెప్పకముందే కట్‌ చెప్పొద్దు’ అని మనోజ్‌ పేర్కొన్నారు.

‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిదే. మంచు మనోజ్‌ ఆర్ట్స్‌, విద్యానిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా స్థాయితో ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని