MAA Elections: నాగబాబుకు విష్ణు కౌంటర్: 10 కాదు.. రూ.75వేలు ఇస్తున్నాం!
మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని, తన తండ్రి మోహన్బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని సినీ నటుడు
హైదరాబాద్: మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని, తన తండ్రి మోహన్బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని సినీ నటుడు, ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు అన్నారు. ‘మంచు విష్ణు ప్యానెల్ ఒక్కో సభ్యుడికి రూ.10వేలు ఇస్తోంది’ అని ఇటీవల నాగబాబు అన్న వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. స్టార్ హీరో మహేశ్బాబుకు రూ.75వేలు గూగుల్ పే చేశానని, ఆయన ఊళ్లో లేకపోవడంతో చూసుకోలేదని వెటకారంగా అన్నారు. ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకుని వాళ్ల దగ్గరి నుంచి రూ.75వేలు వెనక్కి తిరిగి తీసుకుంటానని అదే తన అజెండానని మంచు విష్ణు వ్యంగ్యంగా మాట్లాడారు. గురువారం ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలిస్తే, ఏమేమి చేస్తామో చెబుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ వివరాలు తెలిపిన తర్వాత పలు విషయాలపై విష్ణు మాట్లాడారు.
లోకల్.. నాన్ లోకల్ సమస్య కాదు!
‘‘25 సంవత్సరాల ముందు ‘మా’ స్థాపించినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్ వేరు. మేము ఇప్పుడు అసోసియేట్ మెంబర్స్ సహా 950మంది ఉన్నాం. ఈ సంఖ్య 5వేల వరకూ చేరాలి. భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ యాక్టింగ్ అసోసియేషన్గా ‘మా’ ఉండాలి. అది నా కల. మేము అమలు చేసే పథకాలు వారందరికీ భరోసాను కల్పిస్తాయి. ఇక్కడ లోకల్, నాన్లోకల్ సమస్య కాదు. అవకాశాలు.. ఒక నటుడిగా ఈ ఏడాది నేను బిజీగా ఉండవచ్చు. వచ్చే ఏడాది నాకు మూడు వారాలు కూడా పనిలేకపోవచ్చు. అదే ప్రయారిటీ. చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకమైంది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో.. ఎవరిని తిరస్కరిస్తారో తెలియదు. ఒక ప్రొడ్యూసర్ ట్రెండింగ్లో ఉన్న యాక్టర్ను పెట్టుకుంటారు. అతడు ఈరోజు ట్రెండ్లో ఉండవచ్చు. కొన్నాళ్లకు ఆయన ట్రెండ్ ముగియవచ్చు. ‘మా యాప్’ ఎందుకంటే నూటికి 95మంది నటులు తమని తాము ప్రమోట్ చేసుకోలేరు. అందుకే వాళ్లకు సహకరిస్తాం! జాబ్ కమిటీ వచ్చినప్పుడు నిర్మాతలు మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది’’
టాలెంట్ ఉంటే ఏ భాష వాళ్లనైనా తీసుకోవచ్చు!
‘‘ఒక క్యారెక్టర్ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు క్రియేటర్. ఆయన క్రియేటివిటీని మేము తుంచేయలేం. ఉదాహరణకు జగపతిబాబుగారు అన్ని భాషల్లో ప్రతినాయకుడిగా అదరగొడుతున్నారు. మన మార్కెట్ను పెంచుకోవాలి. ఇతర భాషా నటులను పెట్టుకుంటే మార్కెట్ పరిధి పెరుగుతుందని నిర్మాతలందరూ ఆశిస్తారు. అందులో తప్పులేదు. అదంతా వ్యాపారం. అదే సమయంలో మనవాళ్లకూ అవకాశాలు ఇవ్వండని కోరడంలో తప్పులేదు. ‘ఫలానా నటుడే కావాలి’ అని ఏ హీరో చెప్పడు. భారతదేశంలో ఏ నటుడైనా ఎక్కడైనా నటించవచ్చు. టాలెంట్ ఉంటే తప్పకుండా ఏ భాష వాళ్లైనా తీసుకుంటారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి డ్యాన్స్ మాస్టర్లు ఇక్కడకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మన డ్యాన్స్ మాస్టర్స్కు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. క్రియేటివ్ ఇండస్ట్రీలో రిజర్వేషన్ అనేది అసాధ్యం. నా వరకూ అది నాన్సెన్స్’’
అది చాలా పెద్ద సమస్య!
‘‘నిర్మాత అనేవాడు దేవుడు. ఎందుకంటే డబ్బు పెడుతున్నాడు. ఒక నిర్మాతగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఫలానా నటుడిని పెట్టు’ అని అంటే వాళ్ల చేతికి గాలిపటం ఇచ్చి వెళ్లి ఎగరేసుకో అని చెబుతా. ‘మా’ సభ్యత్వం విస్తృతమైంది. ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అనేది అమెరికాలో ఉంది. అది పవర్ఫుల్ అసోసియేషన్. అన్నీ నాకు తెలుసని నేను చెప్పను. అక్కడున్న పాలసీలు మన వాతావరణానికి ఏవి సరిపోతాయో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అసోసియేషన్లో ఉన్న నియమ, నిబంధలను అనువుగా తీసుకుని ‘మా’ అసోసియేషన్ లోపలికి వచ్చి కొందరు మా మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత అది లేకుండా చేస్తా! రవిబాబు ఒక రాడికల్ వ్యక్తి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా వరకూ నిజం ఉంది. ‘కేవలం మన భాషా నటులను మాత్రమే తీసుకోవాలి’ అనేది చాలా పెద్ద సమస్య. దాన్ని పరిష్కరించాలంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి. మనం బయట నుంచి టాలెంట్ను ఎందుకు తీస్తామో ఇంతకుముందే చెప్పాం. ఆ అవసరం రాకూడదనే ‘మోహన్బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ స్థాపిస్తున్నాం.’’ అని మంచు విష్ణు అన్నారు. ఇక ‘‘ప్రకాశ్రాజ్ మూడుసార్లు ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటేనే ‘మా’ బాగుపడుతుంది’’ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని మంచు విష్ణు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM