AP News: హీరో నాని.. నటుడు సిద్ధార్థ్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్
సినిమా టికెట్ల అంశంపై కమిటీని ప్రభుత్వం నియమించిందని.. థియేటర్ల వర్గీకరణ, ధరలను
అమరావతి: సినిమా టికెట్ల అంశం(cinema ticket issue)పై కమిటీని ప్రభుత్వం నియమించిందని.. థియేటర్ల వర్గీకరణ, ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని(perni nani) చెప్పారు. ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రి పేర్ని నాని సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేశామని.. వాళ్లు ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారని.. అలాంటి వాటిపైనే చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
కమిటీల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం లేదు
‘‘ఈ రోజు డిస్ట్రిబ్యూటర్లు, వారి అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాం. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సినిమా టికెట్ ధరలు పెంచాలని ప్రధానంగా వారు కోరారు. సినీ పరిశ్రమ వర్గాల నుంచి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా వినోదాన్ని ఎలా అందించాలన్నది ఆ కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పాం. కమిటీల పేరుతో కాలయాపన చేయాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా అందరికీ మేలు చేసేలా నిర్ణయం ఉంటుంది.’’
130 థియేటర్లపై చర్యలు
‘‘థియేటర్ యజమానులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా? లేక తెలియక మాట్లాడతున్నారో అర్థం కావటం లేదు. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరితోనూ సమావేశమయ్యాం. రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారు. సినిమా ప్రదర్శనకు రెవెన్యూ శాఖ నుంచి బీఫాం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలని సూచించాం. అయినా కూడా ఇప్పటివరకూ థియేటర్ల యజమాన్యాలు రెన్యువల్ చేయించుకోలేదు. కనీసం లైసెన్స్కు కూడా దరఖాస్తు చేసుకోని వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన 130 థియేటర్లపై చర్యలు తీసుకున్నాం. జీవో నెం.35 ఏప్రిల్ 2021లో వచ్చింది. దానికి నిరసనగా ఇప్పుడు థియేటర్లు మూసివేయడం ఏంటో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’’
హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసి చెప్పారో..
‘‘కథానాయకుడు నాని(Nani) ఎక్కడ ఉంటారో తెలియదు. ఏ సినిమా హాలు పక్కన, ఏ కిరాణా కొట్టు ఉందో తెలియదు. ఆయన ఏ హాలుకు ఏ కిరాణా కొట్టు లెక్కలు చెప్పారో కూడా నాకు తెలియదు. బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నా. సినిమా హాళ్ల కౌంటరు, పక్కనే ఉన్న పచారీకొట్టు కౌంటరు లెక్కపెట్టి చెప్పి ఉండవచ్చు. ఇక చెన్నైలో ఉండే నటుడు సిద్ధార్థ్(siddharth)గారు తమిళనాడు సీఎం స్టాలిన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారు. మద్రాసులో ఉండే ఆయనకు ఏపీ టికెట్లతో సంబంధం ఏంటి?ఆయనేమైనా పన్నులు ఇక్కడ చెల్లిస్తున్నారా? మేము విలాసంగా బతుకుతున్నట్లు మమ్మల్ని ఎప్పుడైనా చూశారా’’ అని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఎవరు వచ్చి ఏం చెప్పినా వినడానికి ప్రభుత్వం సిద్ధం!
‘‘నిర్మాత దిల్రాజు వచ్చి మమ్మల్ని కలిసే విషయమై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. సెప్టెంబరులో సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయనే నాలుగైదు సార్లు ఫోన్ చేశారు. హడావుడి తగ్గిన తర్వాత కలుద్దామని చెప్పా. ఇప్పటివరకూ నాతో ఎవరూ మాట్లాడలేదు. ఎవరు వచ్చినా మాట్లాడటానికి జగన్మోహన్రెడ్డిగారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమలోని అనేక వర్గాల వారు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారు. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష ఉండదు. సినిమా టికెట్ రేట్లకూ కక్ష సాధింపు చర్యలకు ఏమైనా సంబంధం ఉందా? ఏదేదో ఆపాదించుకుని, విమర్శలు చేయడం ధర్మం కాదు. ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేయడమనేది నిరంతర ప్రక్రియ. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని తనిఖీలు చేస్తారు. కొన్నిసార్లు ఆకస్మిక తనిఖీలు కూడా చేయొచ్చు. చిరంజీవిగారు మమ్మల్ని కలిసే విషయమై మాకు ఎలాంటి సమాచారం లేదు. బహుశా సీఎంగారి పేషీకి ఏమైనా చేశారమో తెలియదు.’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్