Cinema News: థ్రిల్‌ చేసే ‘మిస్సింగ్‌’

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్‌’. శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీ   శేషగిరి రావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల

Updated : 14 Nov 2021 07:30 IST

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మిస్సింగ్‌’. శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీ   శేషగిరి రావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 19న  థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ    సందర్భంగా హీరో హర్షా మాట్లాడుతూ ‘‘కొత్తవాళ్లం అంతా కలిసి చేసిన ప్రయత్నమిది. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు నా పాత్ర అందరినీ   ఆకట్టుకుంటుంది’’ అంది నాయిక నికీషా. దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ ‘‘మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే చిత్రమిది. అసభ్యతకు ఏమాత్రం తావుండదు. కొత్తవాళ్లతో కష్టపడి చేశాం. మా    ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: అజయ్‌ అరసాడ, ఛాయాగ్రహణం: జనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని