Pawan Kalyan: పవన్‌తో సినీ నిర్మాతల భేటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ప్రముఖ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు

Updated : 01 Oct 2021 21:24 IST

అమరావతి: జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌తో ప్రముఖ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆయన నివాసంలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, నవీన్‌ ఎర్నేని, సునీల్‌ నారంగ్‌, బన్నీ వాసు, వంశీరెడ్డి తదితరులు పవన్‌ను కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

వీరంతా ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ గురించి విన్నవించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని తామే కోరినట్టు ఆ సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో వారు పవన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని