Mahesh Babu: విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం..

మహేశ్‌ బాబుని కలిసిన ఎంపీ శశిథరూర్‌. ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో ఈ ఇద్దరూ కలుసుకున్నారు.

Published : 09 Sep 2021 01:25 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ అక్కడికి చేరుకున్నారు. మహేశ్‌ని కలిసి, కాసేపు సరదాగా ముచ్చటించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ విశేషాల్ని పంచుకున్నారు. ‘మహేశ్‌బాబు ఇప్పుడే తన సినిమాలోని విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం. మహేశ్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. శశిథరూర్‌తోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఉన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం కార్యక్రమాల్లో భాగంగా శశిథరూర్‌ ఇటీవల హైదరాబాద్‌ విచ్చేసిన సంగతి తెలిసిందే.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని