NabhaNatesh: రాధికలా నటించగలనా? అని కంగారుపడ్డా
సస్పెన్స్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కి బాలీవుడ్లో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అంధాదున్’. ఇప్పుడు అదే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో రూపొందించిన సినిమా ‘మాస్ట్రో’.....
నభానటేశ్ సరదా ముచ్చట్లు
హైదరాబాద్: సస్పెన్స్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కి బాలీవుడ్లో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అంధాధున్’. ఇప్పుడు అదే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో రూపొందించిన సినిమా ‘మాస్ట్రో’. నితిన్ కథానాయకుడిగా నభానటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈసినిమా సెప్టెంబర్ 17న డిస్నీ హాట్స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా నభానటేశ్ విలేకర్లతో ముచ్చటించారు. ఆ సరదా విశేషాలివే..!
ఎప్పుడో చూశా..!
‘బాలీవుడ్లో తెరకెక్కిన ‘అంధాధున్’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ‘మాస్ట్రో’ రూపొందించాం. ‘అంధాదున్’ విడుదలైనప్పుడే సినిమా చూశాను. అది నాకెంతో నచ్చేసింది. చాలా విభిన్నమైన కథాంశంతో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా సాగిపోతుంది. ఈ సినిమా తర్వాతే బాలీవుడ్లో ఇలాంటి జానర్ కథాంశాలకు మరింత పాపులారిటీ పెరిగింది’
కంగారుపడ్డా..!
‘మాస్ట్రో’లో ఆఫర్ వచ్చిందని తెలిసి వెంటనే ఫుల్ ఖుషీ అయిపోయా. రాధిక ఆప్టే పోషించిన పాత్రను ‘మాస్ట్రో’లో నేను చేశాను. రాధికలాగా నేను నటించగలనా? ఒరిజినల్ సినిమాలోని పాత్రకు నేను తెలుగులో న్యాయం చేయగలనా? అని కంగారుగా అనిపించింది. రీమేక్ ఓకే అనుకున్నాక ఒక్కసారి కూడా ‘అంధాధున్’ వీక్షించలేదు.
నితిన్తో నటించడం బాగుంది..!
‘ఈ ఏడాది జనవరి నెలలో ‘మాస్ట్రో’ షూట్ ప్రారంభించాం. కరోనా ఫస్ట్ వేవ్ కంట్రోల్ అయ్యాక షూట్ ప్రారంభించిన అతి తక్కువ మందిలో మా ప్రాజెక్ట్ కూడా ఒకటి. అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్ చేశాం. నితిన్ మంచి వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అలాగే ఆయన కెరీర్లోనే ఇదో విభిన్నమైన పాత్ర అవుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
ఓటీటీతో..!
‘నేను కథానాయికగా నటించిన రెండు సినిమాలు లాక్డౌన్ సమయంలోనే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. కరోనా తర్వాత ఇది నా మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ‘ఈ సినిమా ఓటీటీలో వస్తుంది’ అని అనుకునేదాన్ని. కానీ మొదటి రెండు సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి. మూడో సినిమా ఓటీటీలో వస్తోంది. అందుకు ఇప్పుడు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ‘మాస్ట్రో’ అందరికీ రీచ్ కావాల్సిన మంచి చిత్రం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు అందరూ వస్తారని చెప్పలేం. కాబట్టి ఓటీటీలో విడుదల చేస్తే తప్పకుండా ఈసినిమా అందరికీ చేరువయ్యే అవకాశం ఉంది’
తెలుగుకు అనుగుణంగా..!
‘‘అంధాధున్’ మెయిన్ లైన్ మాత్రమే తీసుకుని దర్శకుడు తన విజన్తో ‘మాస్ట్రో’ తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. నేను మొదటిసారి రీమేక్లో నటిస్తున్నాను. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
డబ్బింగ్ అనుకున్నాక.. కానీ:
‘డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతా’
అన్ని రకాల పాత్రల్లో..
‘భవిష్యత్తు ప్రాజెక్ట్ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకూ ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ‘మాస్ట్రో’లోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!