MAA Elections: పోసాని పేరు పలికి నా నోరు పాడుచేసుకోలేను
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. సుమారు 900 మంది సభ్యులున్న అసోసియేషన్ ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ ....
నాగబాబు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. సుమారు 900 మంది సభ్యులున్న అసోసియేషన్ ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రకాశ్రాజ్ ప్యానల్కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని అసోసియేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్-పోసాని మధ్య జరిగిన వార్ ఆఫ్ వర్డ్స్పై స్పందించారు. అలాగే, ప్రకాశ్రాజ్కి ఓటు వేయొద్దంటూ సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మా’ అనేది చాలా చిన్న సంస్థ. సుమారు 900 మంది మాత్రమే సభ్యులున్నారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఎంతో వాడీవేడీగా జరుగుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది సుమారు 300 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఈ ఏడాది మరో 200 మంది సభ్యులు కూడా ఓటువేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మా ఫ్యామిలీ మొదటి నుంచి ప్రకాశ్రాజ్ ప్యానల్కే మద్దతు ఇస్తోంది. ‘మా’ అభివృద్ధికి ప్రకాశ్రాజ్ వద్ద మంచి ప్రణాళిక ఉంది. ఇప్పటివరకూ ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ దాని సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. నరేశ్ మాత్రమే అసోసియేషన్ మసకబారేలా చేశాడు. ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనివ్వలేదు’’ అని నాగబాబు ఆరోపించారు.
అనంతరం ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ‘‘మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం. మా అన్నయ్య ఏం చెప్పినా మేము ఫాలో అవుతాం. ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. కానీ.. అన్నయ్య ప్రత్యక్షంగా చెప్పలేదుగా?. కొన్ని వ్యక్తిగత ఆరోపణలు మినహాయిస్తే సినీ ఇండస్ట్రీ సంక్షేమం కోసమే పవన్ అలా మాట్లాడాడు. తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా’ అని ఆయన అన్నారు.
అనంతరం పోసాని-పవన్ కాంట్రవర్సీపై స్పందించమని విలేకరి కోరగా.. ‘ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు’ అని ఆయన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇక చివరగా సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘భాజపా నాయకులు ప్రకాశ్రాజ్ గెలవకూడదనుకుంటున్నారు. అందుకే ఆయనకు ఓటు వేయవద్దని సీవీఎల్ నరసిహారావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదు. ఓటు వేయొద్దని చెప్పడానికి ఆయనకు ఏం హక్కు ఉంది. భాజపా, ఆర్ఎస్ఎస్ అంటే నాకు ఎప్పటినుంచో మంచి గౌరవం ఉంది. భాజపా, ఆర్ఎస్ఎస్ నాయకులతో నాకు సత్సంబంధాలున్నాయి. ఇంత చిన్న అసోసియేషన్ ఎన్నికల్లో వాళ్లు జోక్యం చేసుకునే వ్యక్తులు కాదు. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రకాశ్రాజ్ దేశద్రోహి అంటూ సీవీఎల్ చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. ప్రకాశ్ ఈ దేశంలోనే పుట్టారు. ఆయన దేవుడిని నమ్మడు. కానీ, అందరికీ మంచి చేయాలనే గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి’ అని నాగబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్