Varudu kavalenu Review: రివ్యూ: వరుడు కావలెను
పాటలు, ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూ వర్మ జోడీగా నటించడం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం ప్రేక్షకుల...
చిత్రం: వరుడు కావలెను; నటీనటులు: నాగశౌర్య, రీతూ వర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య తదితరులు; మాటలు: గణేష్ కుమార్ రావూరి; ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; కూర్పు: నవీన్ నూలి; కళ: ఏ.ఎస్.ప్రకాష్; సమర్పణ: పి.డి.వి.ప్రసాద్; నిర్మాత: సూర్య దేవర నాగవంశీ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
పాటలు, ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూ వర్మ కలిసి నటించడం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో కీలక సినిమా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తుంటుంది భూమి (రీతూ వర్మ). ఆఫీస్లో ఆమె చాలా స్ట్రిక్ట్. ఎవరి పనీ ఒక పట్టాన ఆమెకు నచ్చదు. రాక్షసి అంటూ ఆఫీస్ ఉద్యోగులు ఆమెను తిట్టుకుంటారు. ఆమెకు పెళ్లి చేయాలని తల్లి (నదియా) సంబంధాలు చూస్తుంటుంది. భూమి మాత్రం పెళ్లికి తిరస్కరిస్తూ వస్తుంది. అప్పుడే ఓ ప్రాజెక్ట్ పని మీద ఆకాష్ (నాగశౌర్య) హైదరాబాద్ వస్తాడు. పారిస్లో ఆర్కిటెక్ట్గా సెటిల్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఆకాష్. భూమి పనిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ పుడుతుంది. ఇక వాళ్ల ప్రేమకథ కంచికి చేరుతుందనగానే కథలో మలుపు. ఆకాష్కి, భూమికీ మధ్య అంతకుముందు కాలేజీలో జరిగిన సంఘటనలు తెరపైకొస్తాయి. ఇంతకీ వాళ్లిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? అసలు కాలేజీలో ఏం జరిగింది? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథ ఇది. దాన్ని పెళ్లితోను, వయసొచ్చిన బిడ్డలకి పెళ్లి చేసి భారం దించుకోవాలని మధనపడే తల్లిదండ్రుల కథతోనూ ముడిపెట్టి సినిమా తీశారు. రెండు దశల్లో సాగే ప్రేమకథల సమాహారమే అయినా.. మొత్తంగా చూస్తే ఇందులో ఉన్నది సన్నటి కథే. ఆరంభ సన్నివేశాలు భూమి పాత్ర చుట్టూనే సాగుతాయి. ఆమె ఆఫీస్ వాతావరణం, ఆమె బాసిజం నేపథ్యంలో సరదాగా సాగుతాయి. ఆ సన్నివేశాలు ‘మన్మథుడు’ని గుర్తు చేస్తాయి. కాకపోతే అక్కడ బాస్ హీరో, ఇక్కడ హీరోయిన్. అంతే తేడా. ఆకాష్ పాత్ర పరిచయం తర్వాత కథలో వేగమేమీ పెరగదు. భూమి.. ఆకాష్ని ప్రేమించిన తర్వాతే కథలో ఓ అడుగు ముందుకు పడినట్టు అనిపిస్తుంది.
ఆ వెంటనే వచ్చే విరామ సన్నివేశాలతో అనూహ్యంగా ఓ మలుపు. అక్కడ ఆకాష్తో తనకున్న బంధం గురించి భూమి చెప్పే మాటలు ఆసక్తిని కలిగిస్తాయి. తదుపరి కథపై ఆత్రుతని పెంచుతాయి. ద్వితీయార్ధం ఫ్లాష్బ్యాక్తో మొదలవుతుంది. అక్కడ మరో ప్రేమకథ మొదలైనట్టు అనిపించినా అందులో కొత్తదనమేమీ లేదు. కాకపోతే నాయకానాయికలు కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫ్లాష్బ్యాక్ తర్వాత మురళీశర్మ, నదియ మధ్య కూతురి పెళ్లి గురించి జరిగే చర్చ హత్తుకునేలా ఉంటుంది. ఆ తర్వాత భూమి ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల పెళ్లి హంగామా మొదలవుతుంది. అక్కడ సప్తగిరి చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగినా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉండటం సినిమాకి కలిసొచ్చే విషయం. మాటలు, పాటలు సినిమాకు ప్రధాన బలం.
ఎవరెలా చేశారంటే: నాగశౌర్య, రీతూ వర్మ అందంగా కనిపించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పలికించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రలకి సరైన ఎంపిక అనిపిస్తారు నాయకానాయికలు. విరామానికి ముందు, క్లైమాక్స్కి ముందు సన్నివేశాల్లో ఆ ఇద్దరి నటన హత్తుకుంటుంది. పాటల్లోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలరించింది. సప్తగిరి, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ తదితరులు నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. మురళీశర్మ, నదియా కథానాయిక తల్లిదండ్రులుగా చక్కటి పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, తమన్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గణేశ్ రావూరి మాటల్లో మెరుపు కనిపిస్తుంది. దర్శకురాలు లక్ష్మీసౌజన్యకి ఇదే తొలి చిత్రమైనా ఎంతో పరిణతితో సన్నివేశాల్ని తెరపైకి తీసుకొచ్చారు.
బలాలు
+ కుటుంబ వినోదం
+ నాగశౌర్య, రీతూ జోడీ
+ ద్వితీయార్ధంలో కామెడీ
+ పాటలు
బలహీనతలు
- సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
- ఊహకు తగ్గట్టుగా సాగే కథ
చివరిగా: భూమి.. ఆకాష్లు మెప్పిస్తారు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత