Shyam Singha Roy: ఈ క్రిస్మస్ మనదే.. ఎనర్జీ దాచి పెట్టుకోండి: నాని
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ విడుదల అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్కి వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి. టీజర్ విడుదల సందర్భంగా ఈ రోజు మీ అందర్నీ చూడటం, మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయింది. దీని కోసమే కదా మేము కష్టపడి పనిచేసేది. కరెక్ట్ సినిమాతో వస్తున్నా.. క్రిస్మస్ మాత్రం మనదే. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా ఫస్ట్డే మార్నింగ్ షో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మీ ఎనర్జీ దాచి పెట్టుకోండి’’ అని నాని తెలిపారు.
ఈ సినిమాతో మీ కెరీర్లో మరో సరికొత్త దశ ప్రారంభించారనుకోవచ్చా?
నాని: ప్రతి సినిమా మనం ఏదైనా కొత్త దశ ప్రారంభించడానికే చేస్తాం. కొన్ని బాగా కుదురుతాయి. కొన్ని కుదరవు. కానీ కష్టం, ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉండదు. ఈసారి ఎందుకో అన్నీ చక్కగా కుదిరినట్లు అనిపిస్తోంది.
‘టక్ జగదీశ్’, ‘వి’ చిత్రాల తర్వాత మీరు ఈ సినిమాతో థియేటర్లోకి వస్తున్నారు? దానిపై మీ అభిప్రాయం?
నాని: ఈ సినిమాతో మేము తప్పకుండా మాంచి సక్సెస్ సొంతం చేసుకుంటామని నమ్ముతున్నాను. క్రిస్మస్ నాకెంతో స్పెషల్. ఓ ఏడాది క్రిస్మస్ సమయంలో విడుదలైన ‘ఎంసీఏ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాను.
టీజర్ చూస్తుంటే ఏదో విప్లవాత్మకమైన కథగా ఉంది. ఇందులో ప్రేమ కథలకు ఎంత వరకూ స్కోప్ ఉంటుంది?
నాని: ఇది ఒక భిన్నమైన లవ్ స్టోరీ
సత్యదేవ్ కథలో నటించడానికి కారణమేమిటి?
నాని: సత్యదేవ్ కొత్త రచయిత కాదు. ఆయన ఎంతో కాలం నుంచి పరిశ్రమలో ఉన్నారు. నేను ఇప్పటి వరకూ కొత్త, పాత అనేది చూడలేదు. సత్యదేవ్ మంచి కథతో వచ్చారు. ఆయన చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అందుకే ఓకే చేశాను.
ఈ స్టోరీ బెంగాలీ నేపథ్యంలో సాగుతుందా?
నాని: ఈ స్టోరీ బెంగాలీ నేపథ్యంలో ఉంటుంది. కానీ, డైలాగ్స్ అన్నీ బెంగాలీలో ఉండవు. ఒక్క డైలాగ్ ఇక్కడ టీజర్లో వచ్చింది. మిగిలినవి అక్కడక్కడ వస్తుంటాయి. ఇప్పుడే ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలీదు.. మీకున్న కొన్ని అనుమానాలు తీర్చడానికి చెబుతున్నా.. సినిమాలో శ్యామ్ వాళ్ల అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. అందుకే అతను బెంగాలీలో మాట్లాడుతుంటాడు.
‘ఎంసీఏ’ తర్వాత సాయిపల్లవితో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
నాని: సాయి పల్లవితో కలిసి మరోసారి స్క్రీన్ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’తో ఇప్పటికే మేమిద్దరం బ్లాక్బస్టర్ అందుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ 24న ఏం జరగనుందో నాకు బాగా తెలుసు. హిట్ కాంబినేషన్గా మేము మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను.
ఈ సినిమాలో మీ లుక్ చాలా విభిన్నంగా ఉంది?
నాని: ఇప్పటి వరకూ మీరు చూడని నానిని ఇక నుంచి చూస్తారు. అదే పనిలో ఉన్నాను. దాని కోసమే కష్టపడుతున్నాను.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?