Bigg boss Telugu 5: అఖిల్-పూజా రొమాన్స్.. ఇది ఏమైనా ఇల్లు అనుకున్నావా.. అంటూ నాగ్ ఫైర్
అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-5’. బిగ్బాస్ ఇచ్చే వరుస టాస్క్లు.. కంటెస్టెంట్స్ల మధ్య వాడీవేడీ చర్చలు.. అప్పుడప్పుడు తలెత్తే వివాదాలతో...
హైదరాబాద్: అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-5’. బిగ్బాస్ ఇచ్చే వరుస టాస్క్లు.. కంటెస్టెంట్స్ల మధ్య వాడీవేడీ చర్చలు.. అప్పుడప్పుడు తలెత్తే వివాదాలతో ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ షోలో తాజాగా నవరాత్రి సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచే బిగ్బాస్ ప్రసారం కానుంది. ‘బంగార్రాజు’గా నాగార్జున పంచెకట్టులో మెరిసిపోయారు. నాగ్ని చూసిన కంటెస్టెంట్స్.. ‘బంగార్రాజుగారు’ అని పిలవగా.. ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ ఆయన నవ్వులు పూయించారు. హైపర్ ఆది, హెబ్బా పటేల్, సింగర్ మంగ్లీ ..తదితర తారలు స్పెషల్ ఫెర్ఫ్మామెన్స్లతో ఆకట్టుకున్నారు.హౌస్లో త్రిమూర్తులున్నారని.. వాళ్లే షణ్ముఖ్, సిరి, జెస్సీలని ఆది సరదాగా పంచుల వర్షం కురిపించారు. అనంతరం శ్రీరామ్ హమీదల రిలేషన్పై స్పందిస్తూ.. ‘మీరు బయటకు వచ్చాక మీ ఇద్దరి మీద ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. హమీద ఇంట్లో శ్రీరామ చెట్టు’ అంటూ ఆది నవ్వులు పూయించారు.
ఇదేమైనా ఇల్లు అనుకున్నావా..?
అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. దసరా కానుకగా మరో కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా తాజాగా వీరిద్దరూ బిగ్బాస్ స్టేజ్పై మెరిశారు. ‘లెహరాయి’ పాటకు స్టెప్పులేశారు. పాటలో భాగంగా పూజాతో రొమాన్స్ చేస్తున్న అఖిల్ని.. ‘ఏరా ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా?’ అని నవ్వుతూ నాగ్ ప్రశ్నించారు. అనంతరం అఖిల్.. ‘హౌస్మేట్స్ ఎవరైనా పూజాహెగ్డేకి ప్రపోజ్ చేసి.. ఆమెని ఒప్పించుకోండి’ అంటూ ఆఫర్ ఇచ్చారు. దాంతో శ్రీరామ చంద్ర.. ‘అల.. వైకుంఠపురములో’ పాటతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. ‘బిగ్బాస్’లో జరిగిన నవరాత్రి సెలబ్రేషన్స్ పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఈరోజు సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.