Bigg boss Telugu 5: అఖిల్-పూజా రొమాన్స్‌.. ఇది ఏమైనా ఇల్లు అనుకున్నావా.. అంటూ నాగ్‌ ఫైర్‌

అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’. బిగ్‌బాస్‌ ఇచ్చే వరుస టాస్క్‌లు.. కంటెస్టెంట్స్‌ల మధ్య వాడీవేడీ చర్చలు.. అప్పుడప్పుడు తలెత్తే వివాదాలతో...

Published : 10 Oct 2021 16:39 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’. బిగ్‌బాస్‌ ఇచ్చే వరుస టాస్క్‌లు.. కంటెస్టెంట్స్‌ల మధ్య వాడీవేడీ చర్చలు.. అప్పుడప్పుడు తలెత్తే వివాదాలతో ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ షోలో తాజాగా నవరాత్రి సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచే బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది. ‘బంగార్రాజు’గా నాగార్జున పంచెకట్టులో మెరిసిపోయారు. నాగ్‌ని చూసిన కంటెస్టెంట్స్‌.. ‘బంగార్రాజుగారు’ అని పిలవగా.. ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ ఆయన నవ్వులు పూయించారు. హైపర్‌ ఆది, హెబ్బా పటేల్‌, సింగర్‌ మంగ్లీ ..తదితర తారలు స్పెషల్‌ ఫెర్ఫ్మామెన్స్‌లతో ఆకట్టుకున్నారు.హౌస్‌లో త్రిమూర్తులున్నారని.. వాళ్లే షణ్ముఖ్‌, సిరి, జెస్సీలని ఆది సరదాగా పంచుల వర్షం కురిపించారు. అనంతరం శ్రీరామ్‌ హమీదల రిలేషన్‌పై స్పందిస్తూ.. ‘మీరు బయటకు వచ్చాక మీ ఇద్దరి మీద ఈవెంట్స్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు. హమీద ఇంట్లో శ్రీరామ చెట్టు’ అంటూ ఆది నవ్వులు పూయించారు.

ఇదేమైనా ఇల్లు అనుకున్నావా..?

అఖిల్‌, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. దసరా కానుకగా మరో కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా వీరిద్దరూ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై మెరిశారు. ‘లెహరాయి’ పాటకు స్టెప్పులేశారు. పాటలో భాగంగా పూజాతో రొమాన్స్ చేస్తున్న అఖిల్‌ని.. ‘ఏరా ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా?’ అని నవ్వుతూ నాగ్‌ ప్రశ్నించారు. అనంతరం అఖిల్‌.. ‘హౌస్‌మేట్స్‌ ఎవరైనా పూజాహెగ్డేకి ప్రపోజ్‌ చేసి.. ఆమెని ఒప్పించుకోండి’ అంటూ ఆఫర్‌ ఇచ్చారు. దాంతో శ్రీరామ చంద్ర.. ‘అల.. వైకుంఠపురములో’ పాటతో ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేశాడు. ‘బిగ్‌బాస్‌’లో జరిగిన నవరాత్రి సెలబ్రేషన్స్‌ పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే ఈరోజు సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని