Nayanthara: విఘ్నేశ్ శివన్తో ఇకపై అక్కడే ఉండనున్న నయన్
అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ వరుస ప్రాజెక్ట్లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి నయనతార. కథానాయికగానే కాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్శివన్తో...
చెన్నై: అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ వరుస ప్రాజెక్ట్లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి నయనతార. కథానాయికగానే కాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్శివన్తో కలిసి కొన్ని సినిమాలకు నిర్మాతగానూ ఆమె వ్యవహరిస్తున్నారు. కాగా, తాజాగా నయనతారకు సంబంధించిన ఓ విషయం కోలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటోన్న నయన్ త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్ గార్డెన్లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.
నాలుగు పడక గదులతో ఉన్న ఈ ఇంటి కోసం నయన్ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని.. త్వరలోనే విఘ్నేశ్ శివన్తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా నయన్-విఘ్నేశ్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని టాక్. వివాహం తర్వాత ఈ జంట నివసించడం కోసమే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్ తెలుగులో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’, తమిళంలో ‘కాతువక్కుల రెందు కాదల్’, ‘కనెక్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?