Mahasamudram: ఈ ప్రేమ పాటకు రష్మిక ఫిదా..!

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహాసముద్రం’లోని ఓ ప్రేమ పాటకు నటి రష్మిక ఫిదా అయ్యారు. పాట చాలా బాగుందని ఆమె అన్నారు. శర్వానంద్‌-సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి...

Published : 06 Sep 2021 11:41 IST

హైదరాబాద్‌: త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహాసముద్రం’లోని ఓ ప్రేమ పాటకు నటి రష్మిక ఫిదా అయ్యారు. పాట చాలా బాగుందన్నారు. శర్వానంద్‌-సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహా సముద్రం’. ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ఆదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా నుంచి సోమవారం ఉదయం ‘చెప్పకే చెప్పకే’ అంటూ సాగే ఓ ప్రేమ పాటను రష్మిక విడుదల చేశారు. ‘ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమ పాట నాకు బాగా నచ్చింది. చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌. శర్వా ఇటీవల నాకు సినిమా ట్రైలర్‌ కూడా చూపించారు. మీ అందరూ అదరగొట్టేశారు’ అని రష్మిక పేర్కొన్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పాటను దీప్తి పార్థసారథి ఆలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని