Sai Dharam Tej: ఐసీయూలోకి కెమెరాలు.. నిఖిల్‌ ఆగ్రహం

సాయిధరమ్‌ తేజ్‌కు చికిత్స చేస్తోన్న వీడియోలు బయటకు రావడం బాధాకరమని నటుడు నిఖిల్‌ అన్నారు. ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతించారు...

Published : 14 Sep 2021 01:45 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌కు చికిత్స చేస్తోన్న వీడియోలు బయటకు రావడం బాధాకరమని నటుడు నిఖిల్‌ అన్నారు. ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతించారు? అంటూ నిఖిల్‌ ప్రశ్నించారు. ఈమేరకు నిఖిల్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన వెంటనే ఆయన్ని మెడికోర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఐసీయూలో సాయిధరమ్‌ తేజ్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. ‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ వైద్యుడు సాయితేజ్‌ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. తాజాగా ఆ వీడియోపై నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వమని ఆయన కోరారు. మరోవైపు, నాలుగు రోజుల నుంచి అపోలోలో సాయితేజ్‌ చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయికి కాలర్‌ బోన్‌ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని