Nithin: నితిన్‌ కొత్త ప్రాజెక్ట్‌ షురూ.. హీరోయిన్‌గా బేబమ్మ

కథానాయకుడు నితిన్‌ సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేస్తున్నారు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ రిలీజ్‌ పనుల్లో బిజీగా...

Published : 10 Sep 2021 15:20 IST

హైదరాబాద్‌‌: కథానాయకుడు నితిన్‌ సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్న అతడు తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ని షురూ చేశాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన పలు సూపర్‌హిట్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎస్‌ఆర్‌ శేఖర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం నగరంలో జరిగింది. ఈ వేడుకకు చిత్రబృందంలోని సభ్యులతోపాటు నిర్మాత అల్లు అరవింద్‌, వెంకీ కుడుముల, అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా నటీనటులపై  అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సినిమా టైటిల్‌ని నేటి సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని