RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఈవెంట్‌.. ముంబయి ఈవెంట్‌లో ఇలా జరగనుందా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆతృతగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.....

Published : 19 Dec 2021 14:25 IST

భారీగా వెళ్తోన్న తెలుగు ప్రేక్షకులు

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆతృతతో ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ముంబయిలో ఓ భారీ ఈవెంట్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ప్లాన్‌ చేసింది. ఈ వేడుక కోసం ఇప్పటికే రామ్‌చరణ్‌ (RamCharan), తారక్ (Tarak)‌, కీరవాణి ఇతర చిత్ర బృందం ముంబయి చేరుకుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రియులు సైతం వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకుని ముంబయి బాటపట్టారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

* ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో ఆదివారం సాయంత్రం ఈ వేడుక జరగనుంది. వేడుక కోసం భారీ సెట్‌ని సిద్ధం చేశారు.

*వేడుకకు సంబంధించిన పాస్‌లను జారీ చేశారు. సుమారు 1500 మందికి ఈవెంట్‌లో పాల్గొననున్నారట. అలాగే పాస్‌లు లేనివారిని వేదిక వద్దకు అనుమతించరు.

*కరోనా కారణంగా ఈవెంట్‌కు వచ్చేవాళ్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాల్సి ఉంటుంది.

*ఈ వేడుకల్లో పాల్గొనేవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలలోపు ఫిల్మ్‌సిటీ బయట ఉన్న గురుకుల్‌ గ్రౌండ్‌లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

*రామ్‌చరణ్‌-తారక్‌ల ఎంట్రీని గ్రాండ్‌ లెవల్‌లో ప్లాన్‌ చేశారట.

*బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు భారీగా పారితోషికం అందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

*ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌తో అదే స్టేజ్‌పై స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించనున్నారట.

*కీరవాణి తన టీమ్‌తో కలిసి పలు పాటల్ని లైవ్‌లో ఆలపించనున్నారు.

*ఈ వేడుకలను ఇప్పుడు లైవ్‌ చేయకుండా.. డిసెంబర్‌ 31న ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే రైట్స్‌ విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.

Read latest Cinema News and Telugu News




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని