NTR: హోస్ట్‌గా ప్రేక్షకుల మనసుని దోచుకుంటోన్న ఎన్టీఆర్‌!

వేడుక ఏమైనా, వేదిక ఏదైనా.. వెండితెరైనా, బుల్లి తెరైనా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్‌గా అలరించిన ఆయన మరోసారి ‘హాట్‌సీట్‌’లో కూర్చుని వినోదంతోపాటు విజ్ఞానం పంచబోతున్నారు.

Published : 02 Aug 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేడుక ఏమైనా, వేదిక ఏదైనా.. వెండితెరైనా, బుల్లి తెరైనా తన మాటలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్‌గా అలరించిన ఆయన మరోసారి ‘హాట్‌సీట్‌’లో కూర్చుని వినోదంతోపాటు విజ్ఞానం పంచబోతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఓ ప్రముఖ ఛానల్‌లో త్వరలోనే ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రోమోని విడుదల చేశారు. భావోద్వేగంతో కూడిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ అధ్యాపకుడిని కథని చూపించిన తీరు మెప్పిస్తుంది. ‘మీరు గెలుచుకున్న ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారు’ అని తారక్‌ అడగ్గా ఆ లెక్చరర్‌ ఇచ్చిన సమాధానం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటోంది. ‘ఇక్కడ మనీతోపాటు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది. ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు విశేషంగా అలరిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని