Kondapolam: ‘ఓబులమ్మ’ గీతం.. వైష్ణవ్‌- రకుల్‌ జోడీ అదుర్స్

Kondapolam: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘కొండపొలం’ సినిమాలోని ఓబులమ్మ గీతం విడుదలైంది.

Updated : 07 Dec 2022 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయకానాయికలుగా దర్శకుడు క్రిష్‌ ‘కొండపొలం’ సినిమా ప్రకటించగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వాళ్లిద్దరి జోడీ ఎలా ఉంటుందోననే ఉత్సుకత మొదలైంది. తాజాగా విడుదలైన ఈ సినిమాలోని తొలిగీతం ‘ఓబులమ్మ’ వాటన్నింటికీ సమాధానం ఇచ్చింది. ఈ సినిమా అక్టోబరు 8న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ‘ఓ ఓబులమ్మ’ ఫుల్‌ వీడియోను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. వైష్ణవ్‌, రకుల్‌ పల్లెటూరి యువతీ యువకుల పాత్రల్లో ఒదిగిపోయారు. మేకలు, గొర్రెల కాపరిగా వైష్ణవ్‌ కనిపించారు. అతడ్ని ప్రేమించిన అమ్మాయిగా రకుల్‌ దర్శనిమిచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. పాటలో చూపించిన ప్రతి లొకేషనూ ఆకట్టుకునేలా ఉంది. ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలిసి రాసిన ఈ పాటని సత్య యామిని, పి.వి.ఎన్‌.ఎస్‌. రోహిత్‌ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రకుల్‌ ఓబులమ్మగా కనిపించనుంది. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు ఈ సినిమాకి నిర్మాతలు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని