Arjuna phalguna: తీయని మాటతో కళ్లు మెరిసే..

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నరేష్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 31న

Updated : 22 Dec 2021 06:05 IST

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నరేష్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ‘‘ఒక తీయని మాటతో కళ్లు మెరిసే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. నాయకా నాయికల మధ్య సాగే ఈ మెలోడీ పాటకు ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలు సమకూర్చగా.. చైతన్య ప్రసాద్‌ సాహిత్యమందించారు. శశ్వత్‌ సింగ్‌, శ్రేయా అయ్యర్‌ ఆలపించారు. వైవిధ్యభరితమైన ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని