Manasanamha: ఆస్కార్‌ అవార్డు బరిలో తెలుగు చిత్రం ‘మనసానమః’

సినిమాకు అత్యున్నత స్థాయి పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల బరిలో ఓ తెలుగు లఘు చిత్రం నిలిచింది. వచ్చే ఏడాది

Published : 07 Dec 2021 02:10 IST

హైదరాబాద్‌: సినిమాకు అత్యున్నత స్థాయి పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల బరిలో ఓ తెలుగు లఘు చిత్రం నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు ‘మనసానమః’(Manasanamha) లఘు చిత్రం అర్హత సాధించింది. యువ దర్శకుడు దీపక్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సుమారు 900కుపైగా పురస్కారాలను గెలుచుకుంది. రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన వివిధ దేశాల్లోని సినీ ప్రియులు... ‘మనసానమః’ ప్రయత్నాన్ని అభినందిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న ఈ చిత్రానికి ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర దర్శకుడు దీపక్‌తో పాటు నటీనటులు విరాజ్, దృశిక, డీవోపీ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని