Republic: సాయిధరమ్‌ తేజ్‌ చిత్రం.. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవకట్టా రూపొందించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక.  

Published : 23 Sep 2021 21:48 IST

హైదరాబాద్: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవకట్టా రూపొందించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. జీ స్టూడియోస్‌ పతాకంపై జె. భగవాన్‌, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబరు 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25న ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్‌)ని చిత్రబృందం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిధరమ్‌ తేజ్‌ మామయ్య, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు దేవ కట్టా తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల సమయంలో చిరంజీవి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని