Pelli SandaD: తిరుమలలో ‘పెళ్లి సందD’ బృందం

రోషన్‌, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణ చేశారు.

Published : 14 Oct 2021 18:58 IST

తిరుమల: రోషన్‌, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం దసరా కానుకగా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా నాయకానాయికలు రోషన్‌, శ్రీలీల, దర్శకురాలు గౌరి.. శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్రం విడుదలకానుండటంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్టు రోషన్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని