Natyam: నాట్యం పాటను విడుదల చేసిన వెంకటేశ్‌

‘నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం’.. ఈ మాటలు తనకి ‘స్వర్ణకమలం’ రోజుల్ని గుర్తు చేస్తున్నాయని అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి...

Published : 29 Sep 2021 11:16 IST

మరలా ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ పోస్ట్‌

హైదరాబాద్‌: ‘నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం’.. ఈ మాటలు తనకి ‘స్వర్ణకమలం’ రోజుల్ని గుర్తు చేస్తున్నాయని అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన ‘నాట్యం’లోని ఓ సరికొత్త పాటను తాజాగా వెంకీ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘పోనీ పోనీ ఈ ప్రాణమే.. కళకై జరిగే ఓ త్యాగమే’ అంటూ లలిత కావ్య ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌ కామరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని