PoojaHegde: ‘రాధేశ్యామ్’ కోసం ఎంతో శ్రమించా: పూజాహెగ్డే

ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే, ఇటీవల దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌...

Updated : 07 Jan 2022 12:55 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

‘‘విభిన్న ప్రేమకథా చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ‘రాధేశ్యామ్‌’తో నా కల నెరవేరింది. ఈ చిత్రంలో ప్రేరణగా నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో కథానాయిక పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకూ ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల్లో ‘రాధేశ్యామ్‌’ క్లిష్టమైనది. ఇది ఒక పీరియాడికల్‌ చిత్రం కావడంతో ‘ప్రేరణ’ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతో రీసెర్చ్ చేశా’’ అని పూజా తెలిపారు. అనంతరం తాను కూడా ఈ లవ్‌ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ప్రేమ-విధికి మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా చేసుకుని ‘రాధేశ్యామ్‌’ రూపుదిద్దుకుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించారు. మూడోవేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం విడుదల ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని