Pooja Hegde: టూర్‌ ఎంజాయ్‌ చేస్తోన్న పూజా హెగ్డే.. ఇవే ప్రూఫ్స్‌‌..!

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న నటి పూజాహెగ్డే. వరుస సినిమా షూటింగ్స్‌తో...

Published : 17 Nov 2021 13:11 IST

హైదరాబాద్‌: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న నటి పూజాహెగ్డే. షూటింగ్‌ల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాల్దీవ్స్‌ వెకేషన్‌ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఈ నెల 13న మాల్దీవులకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్కడ దిగిన కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో నిల్చుని ఫుడ్‌ తింటూ చుట్టూ ఉన్న సముద్రం, ప్రకృతి అందాలను ఆద్యంతం ఆస్వాదించారు. తాను ఒక సాధారణమైన అమ్మాయిలా ఓ అత్యద్భుతమైన అనుభూతి కోసం చూస్తున్నానని పూజా తెలిపారు. అనంతరం బికినీ ఫొటోలు షేర్‌ చేసిన పూజా.. తనని తాను ఓ చాక్లెట్‌బేబీలా పోల్చుకున్నారు. ఇక, డిన్నర్‌టైమ్‌తోపాటు బీచ్‌ పరిసరాల్లో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు యువతని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ‘‘పూజా.. సూపర్‌ డూపర్‌ గర్ల్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో విజయాన్ని అందుకున్నారు పూజాహెగ్డే. ఆమె కీలకపాత్రలో నటించిన ‘ఆచార్య’, కథానాయికగా నటించిన ‘రాధేశ్యామ్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చిరు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’లో నీలాంబరిగా రామ్‌చరణ్‌ సరసన పూజా సందడి చేయనున్నారు. వీటితోపాటు విజయ్‌ ‘బీస్ట్‌’లోనూ పూజానే కథానాయిక.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని